Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే ఆయనకు టిక్కెట్టు నిరాకరణ:
- మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సుమన్
నవతెలంగాణ-గోదావరిఖని
అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్తో చేతులు కలిపి టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర చేశారనీ, అందుకే ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదనీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్నగర్ విశ్వం కమ్యూనిటీహాల్లో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాతో వివేక్ అండతో ఆయన సోదరుడు వినోద్ బీఎస్పీ తరపున బెల్లంపల్లి నుంచి పోటీ చేశారన్నారు. అక్కడ తమ పార్టీ అభ్యర్థి చిన్నయ్యను ఓడించేందుకు విశ్వప్రయత్నం చేశారని ఆరోపిం చారు. మంచిర్యాల, మంథని, పెద్దపల్లి, ధర్మపురి నియోజక వర్గాల్లోనూ టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి మరీ కుట్ర చేశారని అన్నారు. వివేక్కు ధైర్యం ఉంటే ధర్మపురి వస్తే తాము నిరూపిస్తామని సవాల్ విసిరారు. వివేక్ చేసిన పార్టీ విద్రోహ చర్యలపై అధిష్టానానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలిపారు. 3 నెలల నుంచి ప్రక్షా ళన చేసిన తమ అధినేత పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేష్ను ప్రకటించారని అన్నారు. దేశవ్యాప్తంగా ఇండ స్ట్రీయల్స్ పెట్టిన వివేక్ పెద్దపల్లిలో ఏ ఒక్క పరిశ్రమనైనా ఏర్పా టు చేశారా? అని ప్రశ్నించారు. సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ జాలి రాజమణి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు ఉన్నారు.