Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గవర్నర్కు కాంగ్రెస్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, అత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్రెడ్డి, బానో త్ హరిప్రియనాయక్, వనమా వెంకటేశ్వరరావు, బీరం హర్షవర్థన్రెడ్డిలపై ఆర్టికల్ 192 ప్రకారం అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ ఫిరా యించారని, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. శనివారం రాజ్భవన్లో కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ కుంతియా, నేతలు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, షబ్బీర్అలీ, గీతారెడ్డి, జానారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి హర్కర వేణుగోపాల్ తదితరులు గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వీరప్పమొయిలీ విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపులపై కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా స్పీకర్, చైర్మెన్లకు ఫిర్యాదు చేశాయన్నారు. అయినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ చర్యల వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వాళ్లు రాస్తున్న లేఖలన్ని ఒకేలా ఉన్నాయని..అవన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, లేదంటే లోక్పాల్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్ జైపాల్రెడ్డి మాట్లాడుతూ ఫిరాయింపులపై మౌనంగా ఉండొద్దని, బహిరంగంగా ఖండించాలని గవర్నర్ను కోరామని తెలిపారు.