Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే
- అవినీతి లేని సమాజం కోసమే నూతన మున్సిపల్ చట్టం : మీడియాతో ఇష్టాగోష్టిలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓటమి భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎమ్ల పనితీరును ప్రశ్నిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన ప్రవర్తన, హావభావాల్లో ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఆదివారం తెలం గాణ భవన్లో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఈవీఎమ్లతో గెలిచిన బాబు.. నేడు మాత్రం వాటిని ప్రశ్నించ టం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంచి పథకా లను తీసుకురావటం కంటే.. ఉన్నతమైన విధా నాల రూపకల్పన ద్వారానే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవినీతి లేని సమాజం కోసం త్వరలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నిక ల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు డిపా జిట్లు గల్లంతవటం ఖాయమని అన్నారు. కేం ద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని, అం దులో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు. ఎన్ని కల నియమావళి అమల్లో ఉన్న సమయంలో బీజేపీ నేతలు తరలిస్తున్న రూ.8 కోట్లకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వటంపై స్పందించిన కేటీఆర్..సెల్ఫ్ చెక్ మీద అంత పెద్ద మొత్తాన్ని బ్యాంకులు ఎలా మంజూరు చేశాయని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ పని తీరుపై స్పందిస్తూ.. ఈసీ విషయం లో వేలు పెట్టే హక్కు తమకు లేదన్నారు. అయితే ఎన్నికల సంఘం పని తీరులో మాత్రం మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. ఓట్ల గల్లంతు విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ 16 స్థానాలను సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.