Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రయివేట్ కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ గురుకుల కళాశాలలు మెరుగైన అగ్రగామి ఫలితాలు సాధించాయని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ప్రశంసించింది. గురుకులాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మల్లయ్య భట్టు తదితర అధికారులను అభినందించింది. ఈమేరకు శుక్రవారం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగటి నారాయణ, పగడాల లక్ష్మయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. తక్కువ శాతం ఫలితాలకే పరిమితమైన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మరియు ఎయిడెడ్ కాలేజీల పరిస్థితిని మార్చడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చాలని డిమాండ్ చేశారు.
ప్రవీణ్కుమార్, మల్లయ్య బట్టుకు అభినందనలు : టీజీపీఏ
తెలంగాణ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల కంటే ముందు వరుసలలో నిలిచినందుకు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియే (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు యాదయ్య, ఉపాధ్యక్షురాలు చింత వెంకటమ్మ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీసీ గురుకుల కార్యదర్శి మల్లయ్యబట్టుకు అభినందనలు తెలిపారు.