Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలను పక్కదోవ పట్టించేందుకే
- యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్న వ్యూహం
- పరిషత్ ఎన్నికలయ్యేంత వరకూ ఇదే సీన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న రెవెన్యూ ప్రక్షాళన వెనుక ఒక పెద్ద రహస్య అజెండాయే ఉందని తెలుస్తున్నది. దానికి కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ప్రజా సమస్యలు లేనట్టు కనబడుతున్నది. కానీ వాస్తవానికి కొన్ని తరగతుల ప్రజానీకం తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఆశలు పెంచుకున్న లబ్దిదారులు, నిరుద్యోగులు, పసుపు, ఎర్రజొన్న రైతులు వీరిలో ఉన్నారు. మరోవైపు అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం.. కొన్ని ప్రత్యేక హామీలను కూడా గుప్పించారు. నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు పెంపు తదితరాంశాలు ఈ కోవలోకి వస్తాయి. వీటన్నింటినీ నూతన ఆర్థిక సంవత్సరం తర్వాత ప్రారంభిస్తా మంటూ ఆ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు పూర్తయింది. కానీ ఆయా హామీల అమలుకు నిర్దిష్ట కార్యాచరణగానీ, విధి విధానాలనుగానీ ఖరారు చేయలేదు. మరోవైపు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో తమకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఆ పార్టీ పెద్దలు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ పెద్దలు రెవెన్యూ ప్రక్షాళనను ముందుకు తెచ్చారని వినికిడి. గతంలో నయీం హత్య, ఆ తర్వాత మియాపూర్ భూ దందాలు, డ్రగ్స్ కేసులు.. తదితరాంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్టు ప్రజలను మభ్యపెట్టటం ద్వారా గులాబీ నేతలు వార్తల్లో నానుతూ వచ్చారు. పత్రికల్లో పతాక శీర్షికలకెక్కారు. తద్వారా ప్రజల ఆలోచనలను ఎప్పటికప్పుడు పక్కదోవపట్టించగ లిగారు. ఇదే క్రమంలో ఇప్పుడు రెవెన్యూ ప్రక్షాళన ముం దుకొచ్చినట్టు తెలుస్తున్నది. ప్రక్షాళన అంశాన్ని పదేపదే ప్రస్తా వించటం ద్వారా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయటం, వారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవటం, రెవెన్యూ ఉద్యోగ సంఘాల మధ్యలో ఐక్యతను విచ్ఛి న్నం చేయటం ద్వారా యూనియన్లలో చీలికలు తేవటం ఈ ఆపరేషన్ అసలు అజెండా అనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. తద్వారా అవినీతి నెపాన్ని రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది మీదికి నెట్టి తాను మాత్రం సేఫ్గా ఉండొచ్చన్నది సర్కారు పెద్దల వ్యూహం. ఆ క్రమంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల్లోని ఒకరిద్దరు పేరున్న నేతలను దగ్గరకు తీయటం ద్వారా మిగతా సంఘాలను చీల్చొచ్చని వారు భావిస్తున్నారు. ఇందుకోసం మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకరరెడ్డి అల్లుణ్ని సైతం బలి చేశారని తెలిసింది. కీసరలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతణ్ని వేరేచోటికి బదిలీ చేసి, ఆ స్థానంలో మరొకరికి అవకాశమిచ్చినట్టు సమాచారం. ఈ విధంగా స్థానం పొందిన సదరు నేత... ఇప్పుడు సర్కారు చర్యలకు వత్తాసు పలుకుతున్నారని రెవెన్యూ అసోసియేషన్ల నేతలే చెబుతుండటం గమనార్హం. మొత్తం మీద పరిషత్ ఎన్నికల అయ్యేంత వరకూ ఈ ప్రక్షాళన ప్రహసనాలు కొనసాగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడు తుండటం గమనార్హం.