Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
నవతెలంగాణ- కొడిమ్యాల/ ఎల్లారెడ్డి
హనుమాన్ జయంతోత్సవాల సందర్భంగా అపశృతులు జరిగాయి. లారీలు ఢకొీని ముగ్గురు మృతిచెం దారు. ఈ ఘటనలు జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం జరిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పొన్నం అరుణ్గౌడ్(22), పులి రాజేందర్(22) హనుమాన్ దీక్ష తీసుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. కొడిమ్యాల మండల దొంగలమర్రి వద్ద జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉదయం వారిని లారీ ఢకొీట్టింది. పొన్నం అరుణ్గౌడ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పులి రాజేందర్ను 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాదికి చెందిన రొడ్డ రోహిత్(5) లింగారెడ్డిపేట్లోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జరుగు తున్న రథోత్సవాన్ని తిలకించేందుకు వెళ్లారు. అక్కడ పంజాబ్ రాష్ట్రానికి చెందిన లారీ దూసుకొచ్చి బాలుడిని ఢకొీట్టింది. బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంత పెద్ద జాతర జరుగుతుంటే లారీని ఎలా వదిలారని ప్రశ్నించారు.