Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఇంటర్బోర్డు ఇచ్చిన వివరణపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము పరీక్షకు హాజరైనా మార్కులు ఇవ్వకుండా ఇంటర్ ధ్రువపత్రాల్లో ఏఎఫ్, ఏపీ అని రావడంపై కొందరు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. చీఫ్ సూపరింటెండెంట్ల తప్పిదం వల్లే మూడు మెమోల్లో తప్పులు దొర్లాయని చెప్పి తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమని విద్యార్థిసంఘాలు, అధ్యాపక సంఘాలు మండిపడ్డాయి. పరీక్ష ఫలితాల విడుదల తేదీ విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఆలస్యమెందుకు జరిగిందని చెప్పడానికి వారి వద్ద సరైన సమాధానం లేదు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల మోమోల్లో ముగ్గురి విషయంలోనే తప్పులు దొర్లియని ఎలా నిర్దారిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.