Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంధపు కట్టెలు, రెండు కార్లు స్వాధీనం
నవతెలంగాణ- రాజేంద్రనగర్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి గుట్టు చప్పుడు కాకుండా గంధపు చెట్లు నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 14 మందిని రాజేంద్రనగర్ పోలీ సులు అరెస్టు చేశారు. వారి నుంచి గంధపు కట్టెలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ శుక్రవారం మీడియాకు వివరిం చారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాలలో ఉన్న గంధపు చెట్లను కొందరు గుట్టు చప్పుడు కాకుండా నరికి తీసుకెళ్తున్నారు. ఇటీవల ఒకే రోజు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో 18 గంధపు చెట్లను నరికేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గట్టి నిఘా పెట్టారు. రెండు రోజుల కిందట ఆటోలో గంధ పు చెట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ను విచారిస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. 14మంది సభ్యు లు ముఠాగా ఏర్పడి కొంత కాలంగా గంధపు చెట్లను నరికి చేవెళ్ల ప్రాంతానికి చెందిన మోహిన్కు అమ్ముతున్నారని విచారణలో తేలింది. దీంతో మోహిన్తో పాటు 14 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి గంధపు కట్టెలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.