Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం: తాను దొంగ ఓట్లు వేయించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఎమ్మెల్యే పువ్వాడ అజరు సవాల్ విసిరారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఉద్దేశపూర్వకంగా తనపైనా తన కుమారుడిపైనా ఈసీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతో రేణుకా చౌదరి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం పార్లమెంటు సీటును టీఆర్ఎస్ గెలవబోతుందని అజరు ధీమా వ్యక్తం చేశారు.