Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారినందుకు భూమి క్రమబద్దీకరించారని, ఇతర ఎమ్మెల్యేకు కాంట్రాక్టులు, భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు వస్తున్నారనడం సరికాదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి డంపింగ్ యార్డులో పడేస్తే ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉన్నందు వల్లే...దాని పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి అనుమతి లేదని చెబుతున్నారని, వేటికి అనుమతులు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. పిడుగుపాటుకు మరణించిన రైతులకు రూ 10 పరిహారం ఇవ్వాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఇన్పూట్ సబ్సిడీ పేరుతో జాప్యం చేయొద్దన్నారు. జగిత్యాలలో జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.