Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులే కారణం..!
- మేడ్చల్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ- ఉప్పల్
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన దొరదొండ నాయుడు అలియాస్ రమేష్(42) ప్రయివేటు ఉద్యోగం చేస్తుండేవాడు. మల్కాజిగిరికి చెందిన అనిత(32)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకుని ఉప్పల్లోని ప్రశాంత్నగర్లో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో అనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన రమేష్ జరిగిన విషయాన్ని బంధువులకు సమాచారం అందించాడు. తర్వాత అతనూ ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.