Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ బిందెలతో రాస్తారోకో
నవతెలంగాణ- బజార్హత్నూర్
'మూడు రోజులుగా తాగేందుకు నీళ్లు లేవు. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు దొరికే పరిస్థితి లేదు. మరోవైపు మిషన్ భగీరథ నీళ్లిస్తామని చెప్పి పట్టించు కోలేదు. ఇంకెప్పుడిస్తారు. మేం చచ్చాకనా..' అంటూ ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై ఖాళీ బిందెలతో శుక్రవారం రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో మూడు రోజులుగా తాగడానికి నీళ్లు లేక పనులకు వెళ్లలేకపోతున్నామని వాపో యారు. పంచాయతీ సిబ్బందికి విన్నవిం చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు కాలనీలకు మాత్రమే నీళ్లు రావడం లేదని, పైప్లైన్ పగిలిపోయిందని, మరమ్మతులు చేపట్టి నీళ్లిస్తామని చెబుతున్నారని అన్నారు. కానీ మండల కేంద్రంలో ఎక్కడా నీళ్లు రావడం లేదన్నారు. మరోవైపు మిషన్ భగీరథ పైప్లైన్లు వేసినా నీళ్లు రావడం లేదని, ఇంకెప్పుడిస్తారని, నీళ్లు ఇవ్వకపోతే పనులెలా చేసుకునేదని ప్రశ్నించారు. పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించి సత్వరం నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.