Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మూడో దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 23న మూడవ దశ ఎన్నికల నిమిత్తం మార్చి 8న నోటిఫికేషన్ విడుదలైంది. మూడవ దశలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రాజకీయ పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 21 సాయంత్రం ఐదు గంట లతో ప్రచారం ముగుస్తుంది. మూడవ విడతలో మొత్తం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 115 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. అంతేకాకుండా ఒడిశాలో 42 శాసనసభా స్థానాలకు ఇదే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.