Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో ముగ్గురు చిన్నారులు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం పోతరాజుపల్లికి చెందిన సింగారపు అనిల్(35)కు కవ పిల్లలు జాహ్నవి, జాస్మిన్(5). శనివారం తన పిల్లలతోపాటు మేనకోడలు చిన్నారి సాత్వికను తీసుకుని చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి ద్విచక్ర వాహనం మీద బయల్దేరాడు. కొమ్మాల శివారులో ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో అనిల్తోపాటు జాహ్నవి, జాస్మిన్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాత్వికను స్థానికులు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.