Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. జంగారెడ్డి, కార్యదర్శి టి. సాగర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల వల్ల 15 జిల్లాల్లో బొప్పాయి, మామిడి, సపోట, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పండ్ల తోటల కొమ్మలు విరిగిపోయాయని, కాయలు రాలిపోయాయని, మొక్కజొన్న, వరి నేలకొరిగిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనావేసి, ఆహార పంటలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.40 వేలచొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పునరుద్దరించాలని, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని, ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు.A