Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తీహార్ జైల్లోని అధికారులు ఖైదీ నభిర్ వీపుపై ఓమ్ గుర్తు వాతలు పెట్టడాన్ని ఆవాజ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆ జైలు సూపరింటెండెంట్ రాజేష్ చౌహాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏదో నేరం చేసి తీహార్ జైలుకు వచ్చినటువంటి ఖైదీ నభిరును రాజేష్ చౌహాన్, ఇతర అధికారులు హింసించడంతోపాటు, అతడి వీపుపై ఓమ్ అనే గుర్తు వచ్చేలా కాల్చి వాతలు పెట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, పౌర సమాజం దీన్ని తీవ్రంగా ఖండించాలి. మానవత్వాన్ని మంటగలిపే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. దేశంలో లౌకిక విలువల్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. తీహార్ జైలు ఘటనపై సమగ్రమై విచారణ జరపాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అబ్బాస్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.