Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల నష్టపోయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు మేడ పైనుంచి దూకి ఆత్మహత్య పాల్పడటం దిగ్భ్రాంతికరమని తెలిపారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు వచ్చిన మార్కులకు పొంతనలేదని తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ విద్యార్థుల పట్ల మాట్లాడిన తీరు అభ్యంతరంగా ఉందని పేర్కొన్నారు. బోర్డు చేసిన తప్పిదాల దృష్ట్యా విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలను అందజేయాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో ఇంటర్ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు చెందిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ,విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం పట్ల దారుణమని తెలిపారు. ఈమొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.