Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ...మరోవైపు మోడల్ ఎంసెట్, ఇతర బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. రామచంద్రం అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హిమాయత్నగర్లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో మోడల్ ఎసెంట్ పరీక్షను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి మంచి పరిణామం అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ మాట్లాడుతూ అధ్యయనం, పోరాటం నినాదాన్ని కొనసాగిస్తూనే 18 ఏండ్లుగా ఎంసెట్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజుతో నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి, ఉపాధ్యక్షులు టి. రవి, నగర కార్యదర్శి ఎండి జావేద్, అశోక్రెడ్డి, ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య, శోభన్ నాయక్, రవి, ఎజిఎం కుమార్, శ్రీచైతన్య ప్రిన్సిపాల్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.