Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపం
- వీరిలో ఒకరు ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు
నవతెలంగాణ - హైదరాబాద్ సిటీబ్యూరో/ బీర్పూర్/ పెగడపల్లి / కామారెడ్డి
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యా మని మనస్తాపానికి గురైన నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట, పెగడపల్లి మం డలం రాములపల్లె, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో, హైదరాబాద్లో శనివారం జరిగాయి. వీరిలో ఒకరు ఏపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ మేనల్లుడు ఉన్నాడు. ఆయా ప్రాంతాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ వాసవి భువన అపార్ట్మెంట్లో ఉండే ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ ఇంటర్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిలైనందున తాను ఆత్మహత్య చేసుకుంటు న్నట్టు తండ్రితోపాటు సోదరికి మెసేజ్ పెట్టాడు. అనంతరం ఏడో అంతస్తు నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన ధర్మారా మ్ను కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెం దాడు. ధర్మారామ్ మతదేహా నికి శనివారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం పోచంపేటకు చెందిన ఒడ్నాలి శివాణి(16) జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం పూర్తయింది. అయితే పరీక్షా ఫలితాల్లో మూడు (మ్యాథ్-ఏ, మ్యాథ్-బీ, కెమిస్ట్రీ) సబ్జెక్టుల్లో ఫెయి లైంది. దీంతో మనస్తాపానికి గురైన శివాణి శుక్రవారం అర్ధరాత్రి అందరూ పడుకున్నాక చున్నీతో దూలానికి ఉరేసుకుంది. ఘటనా స్థలాన్ని సారంగాపూర్ ఎస్ఐ శీలం రాజయ్య పరిశీలింంచారు. తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే జిల్లాలోని పెగడపల్లి మండలం రాములపల్లెకు చెందిన దొంతరవేని ప్రశాంత్(19) జగిత్యాలలోని ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదివాడు. పరీక్షాఫలితాల్లో ఫెయిల్ కావడంతో రెండు రోజులుగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. శనివారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జీవన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దేవసోత్ - రూపుల కుమార్తె నీరజ(17) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు సీఐ భిక్షపతి తెలిపారు.