Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు జిల్లాల పోలీసులతో పహారా
- రాళ్లదాడి నేపథ్యంలో 144 సెక్షన్
నవతెలంగాణ-నిజామాబాద్ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఒక గ్రూపు జరిపిన రాళ్ల దాడి నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే పట్టణంలో 144 సెక్షన్ విధించారు. హనుమాన్ జయంతి, సాహెబ్ ఈ బరాత్ ఒకటితర్వాత ఒకటి ఉండటంతో జిల్లా కేంద్రంలో ఐదు జిల్లాల పోలీసులు మోహరించారు. ప్రధానంగా హైమద్ బజార్, పెద్ద పోస్టాఫీసు, పెద్దబజార్ సమీపంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో గస్తీ కాస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నగరంలో భజరంగ్ దళ్ నేతృత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాత్రి సమయానికి ర్యాలీ గాంధీచౌక్ ప్రాంతంలోకి చేరుకుంది. ఆ సమయంలో రెండుగ్రూపుల మధ్య వివాదం తలెత్తగా రాళ్లతో కొందరు దాడికి దిగారు. ఈ ఘటనలో వాహనాలు, దుకాణాలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత కొనసాగిస్తున్నారు. ఏసీపీ శ్రీనివాస్తో పాటు సీఐలు, ఎస్సైలు బందోబస్తులో నిమగమయ్యారు.