Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెహ్రూ జూలో చెట్టు విరిగిపడి మహిళ మృతి
- 15 మంది సందర్శకులకు గాయాలు
- మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా
- గజ్వేల్లో గోడకూలి రైతు మృతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జంటనగరాల్లో గత రెండ్రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం పడిన వర్షానికి నగరంలోని జులాజికల్ పార్క్లో భారీ వక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో వరంగల్కు చెందిన నిఖత్ ఫాతిమా (60) మృతిచెందింది. మరో పదిహేను మంది సందర్శకులు గాయపడ్డారు. క్షతగాత్రులు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిఖత్ ఫాతీమా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నెహ్రూ జూలాజికల్ పార్కు సందర్శనకు వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జూపార్క్ను సందర్శిం చారు. ఇంతలో సాయంత్రం ఈదురు గాలులతో పాటు పిడుగుల శబ్ధంతో పెద్ద వర్షం రావడంతో సందర్శకులంతా జూపార్క్లో ఉన్న భారీ చెట్టు కిందకు చేరారు. వర్షం నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నిఖత్ ఫాతిమాపై ఉన్నట్టుండి భారీ చెట్టు పడటంతో తీవ్ర గాయాల పాలైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు జూపార్క్ సిబ్బంది సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు.
చెట్టు నేలకొరగడంతో మరో పదిహేను మందికి స్వల్ప గాయాలకు గురైనట్టు పోలీసులు, జూపార్కు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్కు డైరెక్టర్ సిదానంద్ కుక్రెట్టి, జూ క్యూరేటర్ క్షితిజాలు జూలో నెలకొరిగిన చెట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ప్రత్యామ్నా య చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మృతురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
సిద్దిపేట, గజ్వేల్లో భారీ వర్షం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షంతో గోడ కూలి రైతు మృతిచెందాడు. పట్టణానికి చెందిన రైతు అల్వాల మల్లేశం(55) పశువుల మేత కోసం పొలం వద్దకు వెళ్లాడు. భారీ వర్షం కురియడంతో పక్కనున్న పౌల్ట్రీ ఫాం గోడ వద్ద నిల్చున్నాడు. అప్పటికే నానిన గోడ అతడిపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
అదేవిధంగా, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ మర్కుక్, వర్గల్ మండలాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. వర్గల్లో కరెంటు తీగలు తెగి గొర్రెలపై పడడంతో ఐదు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సిద్దిపేట డివిజన్ హుస్నా బాద్ పట్టణంతో పాటు అక్కన్నపేట మండలాల్లోని అక్కన్న పేట, గౌరవెల్లిల్లో మామిడి కాయలు నేలరాలాయి. కూచన పల్లి గ్రామంలో మూడు రోజులుగా విద్యుత్ నిలిచిపో యింది. నంగునూరు మండలం కొండంరాజుపల్లి, గట్లమ ల్యాల గ్రామాల్లో, చిన్న కోడూరు మండలం మైలారంలో వడగళ్ల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరుసగా పడుతున్న వడగండ్లలో రైతులు కుదేలవుతున్నారు. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. 10 రోజుల్లోనే మూడుసార్లు వడగండ్ల వాన పడింది. వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు.