Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం చైర్మెన్గా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
- చీప్ ప్యాట్రన్గా ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర మూడో మహాసభలు నవం బరు ఒకటి నుంచి నాలుగు వరకు మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని శనివారం చర్లపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహా సభల ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. చైర్మెన్గా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, చీఫ్ ప్యాట్రన్గా ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి వ్యవహరిస్తారు. ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి జె.చంద్రశేఖర్, కోశాధికారిగా ఎ.అశోక్ వ్యవహరిస్తారు. ప్యాట్రన్స్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్, తెలంగాణ ఇండిస్టీ యల్ ఫెడరేషన్ అధ్యక్షులు కె.సుధీర్రెడ్డి, చర్లపల్లి ఇండిస్టీయల్ అధ్యక్షుడు హరీశ్రెడ్డి, చర్లపల్లి ఇండిస్టీ యల్ నోటిఫై మున్సిపాలిటీ కార్యదర్శి రోశిరెడ్డి ఉన్నారు. వీరుగాక మరో పది మంది ప్యాట్రన్స్ గానూ, 33 మంది కార్యదర్శులుగానూ, 17 మంది కమిటీ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. సన్నాహక సమావేశంలో వీరందరి పేర్లను ప్రకటించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ... సీఐటీయూ అంటే ప్రశ్నించడానికి మారుపేరని అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రశ్నించేతత్వమున్నవారని అన్నారు. అందు వల్ల కనీస వేతనాలు, పని గంటలు తదితరాంశాలపై పోరాడాలని సూచించారు. డిమాండ్ల సాధన, సమ స్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో పారిశ్రామికరంగం బాగుండాలంటే కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని తెలిపారు. సంఘటిత రంగాన్ని అసంఘటిత రంగంగా మారుస్తున్న పాలకుల విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. దోపిడీకి గురవుతున్న సమాజాన్ని ఐక్యం చేయాలని ఆయన ఈ సందర్భంగా సీఐటీయూ నాయకత్వానికి పిలుపునిచ్చారు.
నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అనేక రంగాల్లోని కార్మి కులు నేడు అభద్రతా భావంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరినీ ఐక్యం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు అమలు కావాలన్నా, డిమాండ్లను సాధించుకోవాలన్నా ఉద్యమాలే శరణ్య మని తెలిపారు. ప్రజలు, కార్మికుల పక్షాన శాసన మండలిలో తన వాణిని వినిపిస్తానని చెప్పారు. సీఐ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ... కార్మికులందర్నీ ఐక్యం చేయటమే సీఐటీయూ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత పాలకులు కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి బడా కంపె నీలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అనేక సమ్మెలను ముందుండి నడిపించటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, చట్టాలు, హక్కులను అమలు చేయించడానికి సీఐటీయూ కృషి చేస్తున్నదని చెప్పారు. అశోక అధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశంలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, భూపాల్, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్, పద్మశ్రీ, కోశాధికారి వంగూరు రాములు తదితరులు పాల్గొన్నారు.