Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ధాన్యం సేకరణలో ఉన్న ఇబ్బం దులను పరిష్కరించాలని కిసాన్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడితోటల రైతులు బాగా నష్టపోయారని పేర్కొంది. వారికి ఆర్థిక పరిహారం ఇవ్వా లని కోరింది. ఈమేరకు శనివారం సచివాలయంలో వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ జాతీయ నేత కోదండరెడ్డి నేతృత్వంలో కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు. జీవో నెంబర్ 1, 2 ప్రకారం ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని కోరారు. పిడుగుపడి చనిపోయిన రైతు కుటుంబాలకు ఇండ్లు కూలిపోయి చనిపోయి నవారికి ఆర్థిక సాయం అందిం చాలని పేర్కొన్నారు. షెడ్లు ఉన్న ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని కోరారు.