Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
జన్యుపరమైన లోపాలతో రెండు తలలతో ఏర్పడిన మృత శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్సులోని డంగోరియా ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సుజాత ఐదు నెలల గర్భవతి. ఇటీవల సాధారణ చెకప్లో భాగంగా స్కానింగ్ తీయించగా ఆమె కడుపులో రెండు తలలతో శిశువు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. జన్యుపరమైన లోపాలుండటం గుర్తించిన వైద్యులు శిశువును తొలగించకపోతే తల్లి ప్రాణానికే ముప్పు అని భర్త మహేశ్కు వివరించారు. సుజాతను శుక్రవారం ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం డాక్టర్ సాయిలీల ఆధ్వర్యంలో తల్లి గర్భం నుంచి శిశువును బయటకు తీశారు. జన్యుపరమైన లోపాలుండటంతో శిశువును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.