Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకరన్ అకాడమీ చైర్మెన్ నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పకడ్బందీ ప్రణాళికతో చదివితే సివిల్స్ కొట్టడం సాధ్యమేనని సివిల్స్ ర్యాంకర్ ఏల్చూరి జయశేఖర్ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో శనివారం విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ చీఫ్ అడ్వైజర్ వై.సత్యనారాయణ మెలకువలతోనే తాను సివిల్స్ సాధించానని చెప్పారు. జియోగ్రఫీ ఆఫ్షన్స్తో రెండుసార్లు రాసి విఫలమయ్యాయని వివరించారు. ఆ తర్వాత తెలుగు సబ్జెక్టుని ఎంచుకుని విజయం సాధించానని చెప్పారు. అకాడమీ చైర్మెన్ నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యే అభ్యర్థుల్లో అత్యధిక మంది వెనుకబడిన కుటుంబాల నుంచే వస్తున్నారని అన్నారు. జయశేఖర్ తండ్రి చిన్నతనంలోనే మరణించినప్పటికీ ఆయన తల్లి తన కొడుకుని చిన్ననాటి నుంచి కష్టపడి చదివించిందని తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ చీఫ్ అడ్వైజర్ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె.సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.