Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రాంతీయ పార్టీల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరున్నా అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించడం దివాళాకోరుతనమని, తుది విడత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందనడానికి నిదర్శనమని బీ జేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కా ంగ్రెస్కు టీఆర్ఎస్ బీ టీమ్గా మారిందని విమర్శించారు. కేవలం నరేంద్ర మో డీని ప్రధాని పదవి నుంచి దింపేయడమే అజెండాగా పెట్టుకుని కాంగ్రెస్తో పా టూ ప్రతిపక్షాలన్నీ ఈసారి ఎన్నికల ప్రచారం చేశాయని, అయినా, మోడీనే ప్ర ధాని అవుతారని తెలిపారు. దేవెగౌడ, గుజ్రాల్ వంటి బలహీన నేతలు ప్రధానిగా ఎన్నికైతే ఆ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగించగలదని ప్రశ్నించారు.