Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే సమ్మె తప్పదు
- సర్కారుకు మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరిక
- దశలవారీ పోరాటాల్లో పాల్గొనాలని పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పాత, కొత్త మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సమ్మె తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయంటూ గుర్తు చేసింది. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. జీవో 14 ప్రకారం కేటగిరి వారీగా వేతనాలు చెల్లించడం లేదని తెలిపింది. ఈమేరకు శుక్రవారం యూనియన్ అధ్యక్ష ప్రధానకార్యదర్శి కమర్ అలీ, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పిఎఫ్, ఇఎస్ఐ అమలులో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. జీవో 52 ప్రకారం శానిటరీ వర్కర్స్ గ్రూపుల ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలలో పనిచేస్తున్న కార్మికులకు జీవో 14 ప్రకారం వేతనాలు పెంచడం లేదని వివరించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దశలవారీగా ఆందోళన చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పాతమున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికుల వలే జీవో 14 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా రూ12,000, రూ 15,000, రూ 17,500, చెల్లించడంతో పాటు ఈ కార్మికులందరికీ పియఫ్, ఇయస్ఐ, గుర్తింపు కార్డులు వర్తింపజేయాలని, యూనిఫామ్, ఇతర రక్షణ పరికరాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. వయస్సు మీరిందనే సాకుతో కొంత మంది కార్మికులను తొలగించడం అన్యాయమని, అనేక ఏండ్లుగా పని చేసిన వారిని తొలగించడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి రిటైర్మెమెంట్ సుదపాయాలు కల్పించాలని, వారి కుటుంబాలలో ఒకరికి జీహెచ్ఎంసీ తరహాలో ఉపాధి కల్పించాలని, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
దశలవారీగా ఉద్యమకార్యాచరణ
- ఈనెల 25 నుంచి 31 వరకు ప్రచార కార్యక్రమం, కరపత్రాల పంపిణీ, జనరల్ బాడీ సమావేశాలు, హాజరు పాయింట్స్ వద్ద గ్రూపు మీటింగ్లు
- జూన్ ఒకటి నుంచి 3 వరకు చైర్మెన్లు, కమిషనర్లకు మెమోరాండాలు ఇవ్వాలి.
- జూన్ 3న అన్ని మున్సిపాల్టీల వద్ద ధర్నాలు
- జూన్ 12న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలి
- 22న ఛలో హైదరాబాద్ డీఎంఏ కార్యాలయం ధర్నా
- జూన్ 27,28 తేదీల్లో టోకెన్ సమ్మె