Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అవతరణ వేడుకలు అదే విధంగా జాతీయ పండుగలు కూడా
- పరేడ్ గ్రౌండ్కు బదులుగా పబ్లిక్ గార్డెన్లో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఎంతమాత్రం ఇబ్బంది కలగకుండా, మరింత వైభవంగా నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని ఆయన సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతి లోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విష యంపై సమావేశంలో చర్చించారు. 'రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ ఉంటుంది. వడగాల్పులు కూడా ఉంటాయి. అప్పుడు పాఠశాలలకు సెలవు లుంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇండ్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. పరేడ్గ్రౌండ్కు బదులుగా పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీహాల్కు ఎదు రుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వ హిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.