Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధారి: పాస్బుక్ రావడం లేదని మనోవేదనకు గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని రాంలక్ష్మిన్పల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకలి కిష్టయ్య(45)కు ఎకరం భూమి ఉంది. కాగా, కొత్త పాస్ పుస్తకం ఇంకా మంజూరు కాలేదు. దీని కోసం కొంతకాలంంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కిష్టయ్య మృతిచెందాడు.