Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బల్మూరు
పిడుగుపాటుకు యువరైతు మృతిచెందాడు. రెండుచోట్ల రెండు పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనలు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో శుక్రవారం జరిగాయి. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాణాల గ్రామానికి చెందిన తాటికొండ భాస్కర్(31) తన పొలంలో పని చేస్తుండగా ఉరములు మెరుపులతో గాలి వాన వచ్చింది. దీంతో చెట్టుకిందికి వెళ్లాడు. చెట్టపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినుకుంట గ్రామానికి చెందిన అనంత రాములుకు చెందిన పాడి ఆవును పొలంలో చెట్టుకు కట్టేసి ఉంచగా పిడుగు పడి మృత్యువాతపడింది. తోడేళ్లగడ్డ గ్రామంలో వేముల నిరంజన్ రైతుకు చెందిన పాడి ఆవు కూడా మృతిచెందింది.