Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20న ఆరెస్సెస్ చీఫ్తో భేటీ
ముంబయి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు(ఆరెస్సెస్) చూపు నితిన్ గడ్కరీ వైపే ఉందా? అంటే అవుననే అంటున్నాయి కాషాయ శ్రేణులు. ఆ భయంతోనే ప్రధాని మోడీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ను కలవనున్నారా? ప్రధాని అయిన తర్వాత ఒక్కసారి కూడా నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లని మోడీ ఫలితాలు సమీపిస్తున్న వేళ ఎందుకెళ్తున్నారు. దీని వెనుకున్న ఆంతర్యమేమిటనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఫలితాల కంటే ముందే మోడీ మోహన్ భగవత్ను ఈ నెల 20న నాగపూర్లోని ప్రధాన కార్యాలయంలో కలవనున్నారని నాగపూర్కు చెందిన ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు. ఒక వేళ బీజేపీ స్వల్ప మెజారిటీ సాధిస్తే ప్రధాని అభ్యర్థిగా మోడీని కాకుండా మరో బీజేపీ నేతను సూచిస్తుందనే భయంతో సంఫ్ుపరివార్ మద్దతు కోసం భగవత్ను కలవనున్నారని ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.