Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బతో శుక్రవారం నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలు భద్రాద్రి, యాదాద్రి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగాయి. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని సుందరయ్య నగర్కు చెందిన బొర్రా సత్యమ్మ(68) వడదెబ్బకు గురై మృతిచెందింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం నాగంవారిగూడెం గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ అన్యాలపు ముత్తమ్మ(55) వడదెబ్బతో మృతి చెందింది. వారం రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు తట్టుకోలేక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతదేహంపై సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి ఎర్ర జెండా కప్పి నివాళ్లర్పించారు. పెద్దపల్లి
జిల్లా మంథని పట్టణ సమీపంలోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పుల్లె మొగిలి(45) శుక్రవారం వడదెబ్బతో మరణించాడు. రోజూలాగే బంక్లో పనిచేసేందుకు వెళ్లిన మొగిలి మధ్యాహ్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో 108కి సమాచారం అందించారు. మంథని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన తీట్ల పెద్దులు(53) గురువారం పెయింటింగ్ పనులకు వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.