Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ ఎదుట గుండు గీయించిన గ్రామపెద్దలు
- మనస్తాపంతో నిందితుని ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-చిన్నచింతకుంట
గేదెలు చోరీ చేశారని గ్రామ పెద్దలు పంచాయతీ కార్యాలయం ఎదుటే గుండుగీయించి అవమానించారు. దీంతో మనస్తాపం చెంది యువకుడు విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతల గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె. రాఘవేంద్ర తన స్నేహితుడితో కలిసి గ్రామంలోని గేదెలను చోరీ చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్, గ్రామ పెద్దలు రెండు రోజుల కింద ఆ గేదెలను కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు ఇప్పించి గేదెలు తెప్పించారు. గురువారం రాఘవేంద్ర, తన స్నేహితునికి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గుండు గీయించారు. దీంతో మనస్తాపం చెందిన రాఘవేంద్ర సూసైడ్ నోట్రాసి పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని వాగు సమీపంలో విద్యుత్ తీగను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు గమనించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై పర్వతాలు విచారణ చేపట్టారు. సర్పంచ్ హరిత, మాజీ సర్పంచ్ హర్షవర్దన్రెడ్డితో పాటు మరో పదిమందిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు.