Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వార్ఫిన్ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-సిరిసిల్ల
బతుకమ్మ చీరల తయారీ కూలి పెంచాలని పాలిస్టర్, వార్ఫిన్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్ల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఉడుత రవి, మూషర రమేశ్ పాల్గొని మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలు గతం కంటే భిన్నంగా ఉన్నాయనీ, వివిధ రకాల డిజైన్లలో తయారుచేస్తున్నారనీ తెలిపారు. దీనివల్ల కార్మికులకు పనిభారం పెరిగిందన్నారు. ఈ విషయమై చేనేత జౌళిశాఖ కమిషనర్కు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. అధికారులు స్పందించపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి బతుకమ్మ చీరలకు కూలి పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. పవర్ లూం వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.