Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-జమ్మికుంట
రైతుల ఆత్మహత్యలను నివారిచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకెఎస్) ఉపా ధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మి కుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణా తరగుతులు రెండో రోజు కొనసా గాయి. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ.. దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలో దేశం రెండో స్థానంలో ఉందన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉండటం విచారకమన్నారు. కోటీ 30 లక్షల ఎకరాలు తెలంగాణలో సాగవుతుండగా, 50 లక్షల ఎకరాల వరకు కౌలుదారులే సాగు చేస్తున్నా ప్రభుత్వం వారికి పెట్టుబడి సాయం అందజేయడం లేదని అన్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు రాష్ట్రంలో అమలు కాకపోవడం నిర్లక్ష్య ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగారెడ్డి, టి.సాగర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రకటించిన లక్ష రుణమాఫీ వెంటనే ఏక కాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట పెట్టుబడి ఖర్చు శాస్త్రీయంగా లెక్కించి ఎంఎస్పీ నిర్ణయించాలన్నారు. రాఫెల్ కుంభకోణం కంటే పంటల బీమా కుంభకోణం పెద్దదని అభివర్ణించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.