Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొమ్మలరామారం బాధితులకు వీహెచ్ పరామర్శ
నవతెలంగాణ-బొమ్మలరామారం
శ్రావణి, మనీషా, కల్పనల హత్యకేసులో నిందితుడైన మర్రి శ్రీనివాస్రెడ్డిని ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు, గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై సీఎం కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు డి మాండ్ చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్ర ంలో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేస్తున్న ఆమరణ దీక్ష శుక్రవారం రెండోరోజుకు చేరింది. వీహెచ్ సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పంది ంచకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకుంటుంటే కేసీఆర్ తీర్ధయాత్రలు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కనీసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సైతం పట్టించుకోకపోవడం అణగారిన వర్గాలను అవమానపర్చడమే అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎండలు విపరీతంగా ఉండ డంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్థానిక డాక్టర్ నిరోష ఆధ్వర్యంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర మానవ హక్కుల వేదిక నాయకులు రేఖ, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్లుపల్లి అనురాధ, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మంగ నర్సింహులు, మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం దీక్షా శిబిరాన్ని సందర్శించారు.