Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బిచ్కుంద
నైట్హాల్ట్లో బస్సులో నిద్రపోతున్న కండక్టర్ నుంచి దుండగులు టికెట్ డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్లో గురువారం రాత్రి జరిగింది. ఉదయం లేచి చూసే సరికి బ్యాగు కనిపించకపోవడంతో కండక్టర్, డ్రైవర్ బిచ్కుంద పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కృష్ణ వివరాల ప్రకారం..
నారాయణఖేడ్ డిపో బస్సు ప్రతిరోజూ నైట్ హాల్ట్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బిచ్కుంద బస్టాండ్కు వస్తుంది. గురువారం రాత్రి పది గంటలకు భోజనం చేశాక డ్రైవర్ బస్సు పైన, కండక్టర్ బస్సు లోపల పడుకున్నారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో దుండగులు కండక్టర్ నుంచి టికెట్ డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున బ్యాగ్ కనిపించకపోవడంతో కండక్టర్ రోహిత్ చంద్, డ్రైవర్ పెంటప్ప బిచ్కుంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా టికెట్ మిషన్ డోర్ వద్ద, బస్టాండ్ ప్రాంతంలోని దుకాణా సముదాయం వెనుక కాష్ బ్యాగు లభించాయి. అందులో ఉన్న రూ.18 వేలు చోరీకి గురైనట్టు కండక్టర్ తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.