Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు దావులూరు వెంకట్రావు(97) అంత్యక్రియలు హైదరాబాద్లోని తిరుమలగిరి స్వర్గపురి శ్మశాన వాటికలో శుక్రవారం జరిగాయి. అంతకు ముందు ఏఎస్ రావు నగర్ పరిధిలోని సాయినాథపురంలో గల జనాభ్యుదయ సంఘం వృద్ధుల ఆశ్రమంలోని గ్రౌండ్లో వెంకట్రావు భౌతిక కాయాన్ని పార్టీ ఉద్యమ శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు సందర్శనార్ధం ఉంచారు. ప్రభుత్వరంగ సంస్థల కార్మిక నాయకులు యస్ నర్సింహారెడ్డి, సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కమిటీ నాయకులు జె.చంద్రశేఖర్, జి.యాదగిరిరావు, సిహెచ్.కష్ణారావు, యన్.శ్రీనివాస్, కాప్రా ఏరియా నాయకులు శ్రీనివాస్, ఉన్ని కష్ణన్, సోమయ్య చారి, ఉదయ పిబి చారి, ఉదయ భాస్కర్, జగన్మోహన్ రావు తదితరులు నివాళి అర్పించారు. వృద్దాశ్రమం నుంచి 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై 11 గంటలకు తిరుమలగిరి శ్మశాన వాటికకు చేరింది. అక్కడ అంత్యక్రియలు జరిగాయి.