Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహీంద్ర ఫ్యాక్టరీలో సిలిండర్ పేలి ఇద్దరు..
- కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే హరీశ్రావు
- సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు
నవతెలంగాణ - జహీరాబాద్ /సిద్దిపేట ప్రతినిధి
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రెండు చోట్ల జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహీంద్ర కంపెనీలో సిలిండర్ పేలి ఇద్దరు చనిపోగా, కాళేశ్వరం, మల్లన్నసాగర్ మధ్య కాల్వ పనుల్లో చేపట్టిన బ్లాస్టింగ్తో బండరాయి తగిలి ప్రమాదవశాత్తు విద్యార్థి మృతిచెందాడు. ఘటన పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి శివారులో మహీంద్రా ఆండ్ మహీంద్రా అనుబంధ కర్మాగారమైన మహీంద్ర సీఐఈ (ముస్కో) ఉంది. అందులో శుక్రవారం తెల్లవారు జామున నైట్రోజన్ సిలిండర్ పేలి కార్మికుడు ప్రదీప్(26) అక్కడికక్కడే మతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓమిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స జిల్లా మంథని పట్టణ సమీపంలోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పుల్లె మొగిలి(45) శుక్రవారం వడదెబ్బతో మరణించాడు. రోజూలాగే బంక్లో పనిచేసేందుకు వెళ్లిన మొగిలి మధ్యాహ్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో 108కి సమాచారం అందించారు. మంథని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన తీట్ల పెద్దులు(53) గురువారం పెయింటింగ్ పనులకు వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.