Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడుపు నొప్పి భరించలేకనేనంటున్న కుటుంబీకులు
నవతెలంగాణ-ఆదిలాబాద్అర్బన్
కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో శుక్రవారం జరిగింది. కుటుంబీకులు, రిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన తలారి నారాయణ(37) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 15న కడుపునొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో చేర్పించారు. అయినా నొప్పి తగ్గడం లేదని నారాయణ ఆవేదనకు గురయ్యాడు. బయ టకు వెళ్లొస్తానని చెప్పి భవనం మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహ త్యాయత్నం చేశాడు. వైద్య సిబ్బంది గమనించి ఐసీయూలో చేర్చి వైద్యం అందించారు. తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగరాజు తెలిపారు.