Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుగా ప్రకటిస్తే క్యాంపు రాజకీయాలు : చాడ
నవతెలంగాణ-కరీంనగర్ టౌన్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను జూలై 2న ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాదేశిక ఫలితాలు ముందుగా ప్రకటిస్తే క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్టు అవుతుందని అన్నారు. ముందుస్తు ఎన్నికలకు పోవడం ద్వారా ఇప్పటికే ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలు పెంచుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. 26మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకూ బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు మచ్చరమేశ్ పాల్గొన్నారు.