Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- జాతీయ ఉపాధి హామీ జాయింట్ కమిషనర్కు వ్యకాస వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వడగాల్పులతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీచట్టం జాయింట్ కమిషనర్ సైదులును శుక్రవారం హైదరాబాద్లో వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. పనిప్రదేశంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూలీలకు ఇవ్వాలని కోరారు. పనిప్రదేశంలో టెంటు, లెదర్ వాటర్ బ్యాగులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎండాకాలంలో వడగాల్పులకు గురికాకుండా తగు జాగ్రత్తలు ప్రభుత్వం ముందుగానే తీసుకోవాలని కోరారు. వేసవిలో పని కొలతలను రద్దు చేయాలని తెలిపారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పని కల్పించాలని పేర్కొన్నారు.