Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములివ్వం : సెల్ టవరెక్కి రైతుల నిరసన
నవతెలంగాణ- సత్తుపల్లి
'మా ప్రాణాలు పోయినా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు సెంటు భూమి కూడా ఇవ్వబోము' అంటూ బాధిత రైతులు సెల్ టవరెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో శనివారం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవే బృందం శనివారం గ్రామంలోని రైతులకు చెందిన భూములను సర్వే చేసేందుకు వచ్చింది. విషయం తెలిసిన రైతులు వెంటనే అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకున్నారు. ఆందోళన చేశారు. బూములు ఇచ్చే ప్రసక్తి లేదంటూ సర్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమీపంలోని సెల్టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి రైతుల తో మాట్లాడారు. నచ్చజెప్పి సెల్ టవర్ నుంచి దింపారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ గ్రామంలో 50మంది రైతులకు సంబంధించిన భూములు సుమారు 100ఎకరాల వరకూ కోల్పోనున్నామన్నారు. రైతులంతా ఎకరం, అరెక రం ఉన్న పేద రైతులేనన్నారు. భూముల్లో బోరులతో పాటు వర్షాధారంతో రెండు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఉన్న ఆ భూములూ కోల్పోతే తాము ఎలా జీవనం సాగించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ విజరుకుమార్ మాట్లాడుతూ.. రైతులకు నష్టం జరగకుండా చూస్తామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.