Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బావిలో నిరసన తెలిపిన బాధిత కుటుంబాలు
- నిందితుడిని ఉరితీయాలని భీష్మించిన వైనం
నవతెలంగాణ-బొమ్మలరామారం/జవహర్నగర్
ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ శ్రీనివాస్రెడ్డిని ఉరితీయాలంటూ యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో హాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగం చేశారు. శనివారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న 30 మందిని అరెస్టు చేసి హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. సొంత పూచికత్తుపై వారిని విడుదల చేశారు.
బావిలో బాధిత కుటుంబాల నిరసన
తమకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు మనీష, శ్రావణి మృతదేహాలు లభించిన బావిలో కూర్చోని నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించడం లేదని గ్రామస్తులతో కలిసి బాధితులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును కలెక్టర్ అనితారామచంద్రన్ ఎదుట వెళ్లబోసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ద్వారా విచారణ జరపాలనీ, వెంటనే నిందితున్ని ఉరి తీయాలనీ, బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనీ, మాచనపల్లి- హాజీపూర్ మధ్య ఉన్న షామీర్పేట వాగుపై బ్రిడ్జి నిర్మించాలనీ వినతిపత్రంలో అందజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
పాప పరిహారం కోసం మేడిచెట్టుకు పూజులు
నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను హత్య చేసిన అనంతరం మేడి చెట్టుకు మృతుల పేర్లు రాసినట్లు గ్రామస్తులు గుర్తించారు. ప్రతిరోజూ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేవాడని గ్రామస్తులు తెలిపారు. మేడిచెట్టుపై మనీష పేరు స్పష్టంగా ఉంది. ఇంకా నాలుగు పేర్లు ఉన్నట్టు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చెట్టుపై ఉన్న పేర్లను పోలీసులు పరిశీలించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తే శ్రీనివాసరెడ్డి దారుణాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. దర్యాప్తు వేగవంతం చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
జవహర్నగర్ పీఎస్ ఎదుట ఆందోళన..
'హాజీపూర్ ఘటనకు స్పందించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మానవతా దక్పథంతో బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులకు ఇప్పటివరకూ ఎలాంటి న్యాయం చేయలేదు. కమిషనర్కు ఉన్న సోయి సీఎం కేసీఆర్కు లేకపోవడం సిగ్గు చేటు' అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హాజీపూర్ బాధితుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షను భగంచేసి మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్కు తరలించిన విషయం తెలుసుకున్న వీహెచ్.. పార్టీ కార్యకర్తలతో తరలివచ్చారు. బాధితులను, గ్రామస్తులను విడుదల చేయాలని పీఎస్ ఎదుట బైటాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వీహెచ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పంజాగుట్ట చౌర స్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిసి అవమానించారని, ఈ ఘటనపై దళితులు ఇప్పటికీ టీఆర్ఎస్పై గుర్రుగా ఉన్నా రనీ చెప్పారు. హజీపూర్ బాధిత కుటుంబాలకు అన్నివిధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జవ హర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండకింది ప్రసాద్ ఉన్నారు.