Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైకి చూడటానికి విచారణలోనే కేసులు
- నాన్చివేత ధోరణిలో మరిన్ని
- ఉన్నతాధికారుల అండతో తప్పించుకుంటున్న రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా శాఖల అధికారులు ఎక్కడ లంచం డిమాండ్ చేసినా అవినీతి నిరోధక శాఖ వల పన్ని మరీ పట్టుకుంటున్నది. ప్రతి రోజూ ఏదో ఒక అధికారి చిక్కిన వార్తలు వింటూనే ఉన్నాం. ఆ తర్వాత ఆ అధికారిపై శాఖాపరమైన చర్యలను చూస్తూనే ఉన్నాం. రెవెన్యూ శాఖలో మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నది. అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డ అధికారులు... శాఖాపరమైన విచారణలో సచివాలయ అధికారుల అండతో శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. నాన్చివేత ధోరణితో మరికొందరు అధికారులు పబ్బం గడుపుతున్నారు. సచివాలయం కేంద్రంగా ఐదేండ్లలో రెవెన్యూ శాఖకు సంబంధించి 50 కేసులు మూసివేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తెచ్చిన పలు కేసుల వివరాలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
అవినీతికి పాల్పడటం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తారు. ఆ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం ద్వారా సమగ్ర నివేదికను పంపడం జరుగుతుంది. ఆ అవినీతి అధికారిని కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలని సూచిస్తారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ నివేదికను పరిశీలించి ఆ అధికారిపై కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలి. కానీ, రెవెన్యూ శాఖలో అలా జరగడం లేదు. దీనికి రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు కేసులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2010 సంవత్సరంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, అదే సంవత్సరం మరో సందర్భంలో సీనియర్ అసిస్టెంట్ మోహన్రావు లంచం తీసుకుంటుండగా...బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని పట్టుకున్నారు. వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చారు. నాలుగేండ్ల పాటు సత్యనారయణ, మోహన్రావు కేసులను ఎటూ తేల్చకుండా సచివాలయంలో నాన్చారు. చివరకు ప్రభుత్వం సత్యనారాయణపై కేసు ఉపసంహరిస్తున్నట్టు జీవో 192ను ప్రభుత్వం విడుదల చేసింది. రికార్డుల్లో మాత్రం ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నట్టు చూపించడం జరుగుతున్నది. మోహన్రావు కేసునూ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఆ కేసూ ఇంకా పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ 2011లో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. అదే సందర్భంలో ఆదా యానికి మించి ఆస్తులు పోగు చేసుకున్నట్టు సోదాల్లో గురిచారు. ఈ రెండు కేసుల్లో సమగ్ర విచారణ జరిపి రా ములు నాయక్ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అ డగ్గా, కేసు మూడేండ్లు పెండింగ్లో ఉంచి చివరకు శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతవరకు ఈ కేసు విషయంలో శాఖ పరంగా ఏ చర్యలూ తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్రిజిస్ట్రార్ సహదేవ్ 2011లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు సంవత్సరాల తర్వాత కేసు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్రిజిస్ట్రార్ వనజ లంచం తీసుకుంటుండంగా 2013లో రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆరు సంవత్సరాలపాటు నాన్చి నాన్చి 2019లో చివరకు చర్యలు తీసుకోకుండా కేసు మూసివేశారు.
అవినీతి కేసుల మూసివేతపై విచారణ జరపాలి
రెవెన్యూ శాఖలో అవినీతి పాల్పడుతూ పట్టుబడ్డ అధికారులకు సచివాల యంలోని కొందరు అధికా రులు కొమ్ముగాస్తున్నారు. దీంతో శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వారు బయటపడుతున్నారు. గత ఐదేండ్లలో 50 అవినీతి కేసులు మూసేశారు. దీంతో తప్పుచేస్తే శిక్ష పడుతుందన్న భయం పోయింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి సమగ్ర విచారణ జరిపించాలి. అవినీతి అధికారులపైనా, వారికి అండగా నిలుస్తున్న అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్గా కోరుతున్నాం. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శనివారం నాడు వినతిపత్రం కూడా అందజేశాం. తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటేనే లంచాలు తీసుకోవడానికి తప్పు చేయడానికి అధికారులు జంకుతారు.
- యం. పద్మనాభరెడ్డి
-ఫోరమ్ ఫర్ గుండ్ గవర్నెస్ కార్యదర్శి