Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిమ్మాపూర్/నిర్మల్ టౌన్
తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి దుంబాల రాజమ్మ(88) వడదెబ్బతో మృతిచెందింది. వేడిగాలులతో అస్వస్థతకు గురై మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లాకేంద్రంలో డాక్టర్స్లైన్ ఏరియాలో ఉదయం వేళ గుర్తుతెలియని వ్యక్తికి వడదెబ్బ తగిలి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు 108వాహనంలో ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుని వయస్సు 55ఏండ్లు ఉంటుంది. ఇతర వివరాలు తెలియాల్సిఉందనీ సీఐ జాన్దివాకర్ తెలిపారు.