Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆర్మూర్టౌన్
నిజామాబాద్ ఆర్మూర్ పట్టణంలోని రాజారామ్నగర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ వన్నెల్ లత భర్త జో శ్రీనివాస్పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు ఎస్ఐ విజరునారాయణ ఆదివారం తెలిపారు. బాలికపై వేధింపులకు పాల్పడటంతో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. శ్రీనివాస్ తమ పక్కింట్లో ఉండే బాలికను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. పెండ్లి చేసుకోవాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలోనూ రెండు పెండ్లిళ్లు చేసుకున్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.