Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో పోస్ట్ చేసిన సర్పంచ్
నవతెలంగాణ-బొమ్మలరామారం
హాజీపూర్ బాధితులకు న్యాయం చేయాలని యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేయగా కేటీఆర్ స్పందించారు. ఈ విషయమై బిట్టు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్రెడ్డిని చట్ట ప్రకారం విచారణ వేగవంతం చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. వరుస ఎన్నికల్లో బిజీగా ఉన్నందున గ్రామాన్ని సందర్శించలేకపోయానన్నారు. ఈ నెల 23 తర్వాత బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శిస్తారన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను కొంత మంది రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వారి కుటుంబాలకు భరోసాగా ఉంటానని హామీనిచ్చారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పొలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చడానికి స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడుతానన్నారు.