Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గట్టునెల్లికుదురులో అత్యవసర క్యాంపు
నవతెలంగాణ-తెలకపల్లి
ఆహార పదార్థాలు వికటించి 30మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్, మండల వైద్యాధికారి తెలిపిన వివరాల ప్రకారం... గట్టునెల్లికుదురు గ్రామానికి చెందిన హుస్సేన్ శుక్రవారం ఒడిబియ్యం వండి గ్రామస్తులకు రాత్రి భోజనం పెట్టారు. ఆహార పదార్థాలు వికటించి 30మంది అస్వస్థతకు గుర య్యారు. గ్రామ సర్పంచ్ సుగుణమ్మబాబుగౌడ్ మండల వైద్యాది కారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన డాక్టర్ దశరథ గ్రామంలో అత్యవసర క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. శనివారం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై డాక్టర్లను సంప్రదించగా ఆహార పదార్థాలు ఉదయం వండి రేకుల కింద ఉంచారనీ, ఎండ తీవ్రతకు వికటించాయనీ తెలిపారు.