Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌకర్యాల కోసం మూడేండ్లుగా నిరసన
నవతెలంగాణ-మల్యాల
జగిత్యాల జిల్లా కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భక్తులు మౌనదీక్ష చేశారు. ఆలయం ఎదుట 200కుపైగా భక్తులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిరసన తెలిపారు. పెద్ద హనుమాన్ జయంతికి కొండగట్టుకు లక్షలాది భక్తులు వస్తారనీ, అయినా అధికారులు నామమాత్రంగానే ఏర్పాట్లు చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దీక్షని మూడేండ్లుగా హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడుతూ.. మౌన దీక్షకు ఫలితంగా ఆలయానికి సంబంధించిన 300ఎకరాల భూమి తప్ప ఇంతవరకు శాశ్వత పరిష్కారం కింద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు రూ.12కోట్లకుపైగా ఆదాయం వస్తున్నా సదుపాయాలకు వినియోగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ చుట్టూ పక్కల భక్తుల సౌకర్యార్థం గదులను ఏర్పాటు చేయాలని కోరారు. కోనేరు వద్ద మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలన్నారు.